విద్యుదీకరణ పనులకు రైల్వే సేఫ్టీ కమిషనర్ ఓకే
ABN, First Publish Date - 2022-03-23T06:49:21+05:30
విద్యుదీకరణ పనులు చేపట్టిన కదిరి - తుమ్మణంగుట్ట, పాకాల-కలికిరి రైల్వే మార్గాలకు లైన్ క్లియరైంది.
ములకలచెరువు, మార్చి 22: విద్యుదీకరణ పనులు చేపట్టిన కదిరి - తుమ్మణంగుట్ట, పాకాల-కలికిరి రైల్వే మార్గాలకు లైన్ క్లియరైంది. ధర్మవరం నుంచి పాకాల వరకు ఉన్న 226 కిలోమీటర్ల రైల్వే మార్గంలో చేపట్టిన విద్యుదీకరణ పనుల్లో మొదటి విడతగా చేపట్టిన కదిరి నుంచి బి.కొత్తకోట మండలం తుమ్మణంగుట్ట, కలికిరి నుంచి పాకాల వరకు పనులను పూర్తి చేశారు.16న కమిషనర్ ఆఫ్ రైల్యే సేఫ్టీ(సీఆర్ఎస్) అభయ్కుమార్ రాయ్ తనిఖీలు చేపట్టిన విషయం విదితమే. షార్ట్ సర్క్యూట్లు, పవర్ డ్రిప్ డౌన్ టెస్ట్, స్పీడ్ టెస్ట్లను నిర్వహించారు. ఈ నేపథ్యంలో కదిరి - తుమ్మణంగుట్ట, కలికిరి-పాకాల మార్గంలో పూర్తయిన పనులకు అనుమతి ఇస్తూ మంగళవారం ఆయన ఆదేశాలు జారీ చేశారు.తుమ్మణంగుట్ట-కలికిరి మధ్య రెండవ విడతలో చేపట్టిన పనులు ఆగస్టు కల్లా పూర్తి చేసి ధర్మవరం - పాకాల మధ్య కరెంటు రైళ్ళు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది.
Updated Date - 2022-03-23T06:49:21+05:30 IST