ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓరూరుపేట వాసి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-08-06T06:38:37+05:30

నగరి పట్టణ పరిధిలోని ఓ ప్రైవేటు లాడ్జీలో బాల మురళి(48) ఆత్మహత్య చేసుకున్నాడు.

లాడ్జిలో మృతి చెందిన బాలమురళి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగరి, ఆగస్టు 5: నగరి పట్టణ పరిధిలోని ఓ ప్రైవేటు లాడ్జీలో బాల మురళి(48) ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు నిండ్ర మండలం ఓరూరుపేట గ్రామ నివాసిగా గుర్తించారు. 20 సంవత్సరాల క్రితం భార్యతో గొడవపడి వెళ్లిపోయాడు. శ్రీకాకుళం జిల్లాలోని ఎల్‌ఎన్‌ పేట మండలానికి చెందిన మోదుగువలస గ్రామంలో వంశధార ప్రాజెక్టులో జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నట్లు ఐడీ కార్డు ద్వారా పోలీసులు నిర్ధారించారు. నెల రోజుల క్రితం సొంతూరుకు వచ్చి మద్యం తాగి గొడవ చేయడంతో భార్య గీత, కుమారుడు చరణ్‌ నిండ్ర పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో జూలై 30వ తేదీ నగరికి వచ్చి ప్రైవేటు లాడ్జీలో ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు తలుపులు తెరవకపోవడంతో లాడ్జీ నిర్వాహకులకు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా ఉరేసుకుని కనిపించాడు. మృతుడు భార్య గీతకు పోలీసులు సమాచారం అందించారు. గీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివశంకర్‌రెడ్డి తెలిపారు.


Updated Date - 2022-08-06T06:38:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising