ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చోరీయత్నం.....జనం దాడిలో దుర్మరణం

ABN, First Publish Date - 2022-05-18T06:24:50+05:30

ఓ ఇంటిలో చోరీయత్నానికి పాల్పడబోయిన 30 ఏళ్ల వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన తిరుపతి జిల్లా గూడూరులో చోటుచేసుకుంది

చోరీకి వచ్చి చనిపోయిన వ్యక్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, మే 17: ఓ ఇంటిలో చోరీయత్నానికి పాల్పడబోయిన 30 ఏళ్ల వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన తిరుపతి జిల్లా గూడూరులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.... మంగళవారం రాత్రి గూడూరు పట్టణ పరిధిలోని తిలక్‌నగర్‌ ప్రాంతంలో నివాసముంటున్న రవి తన ఇంటి ముందు ఆరుబయట నిద్రిస్తున్నాడు. కుక్కల అరుపులు విని రవి నిద్రలేవగా సమీపంలో ఒక వ్యక్తి చోరీ యత్నానికి పాల్పడుతున్నట్లు గుర్తించాడు.కేకలు వేస్తూ అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు తిరగబడి దాడికి పాల్పడ్డాడు.ఈలోపు అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు ఆ వ్యక్తిని పట్టుకుని కట్టేసి దేహశుద్ధి చేసి రెండోపట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గాయాలపాలైన ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మంగళవారం ఉదయంం మృతి చెందాడు.మృతుడు ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు.ఎస్‌ఐ తిరుపతయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-05-18T06:24:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising