వేడుకల పేరుతో అరాచకం వద్దు: డీఎస్పీ
ABN, First Publish Date - 2022-12-31T01:53:04+05:30
నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి చెప్పారు.
చిత్తూరు, డిసెంబరు 30: నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి చెప్పారు. శుక్రవారం ఒకటో పట్టణ పోలీ్సస్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలన్నారు. భక్తుల సౌకర్యార్థం కాణిపాక ఆలయం వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల దృష్ట్యా కొన్ని ఆంక్షలు ప్రకటించారు.
శనివారం రాత్రి 10 గంటల్లోపు షాపులు, బార్లు, రిసార్టులను మూసివేయాలి.
రాత్రి 12 గంటల తరువాత రోడ్లపై ఎవరూ తిరగకూడదు.
పనులపై ఎక్కడికైనా వెళ్లి వచ్చే వారు తగిన ఆధారాలను చూపించాలి.
త్రిబుల్ రైడింగ్, బైక్ రేసింగ్పై కఠిన చర్యలు.
అన్ని కూడళ్లలో వాహనాల చెకింగ్ ఉంటుంది.
మద్యం తాగి వస్తే కఠిన చర్యలు తప్పవు.
రోడ్లపై యువత కేక్ కటింగ్ చేయకూడదు.
Updated Date - 2022-12-31T01:53:38+05:30 IST