గురువుల ఆశీర్వాదంతోనే నైటింగేల్ అవార్డు
ABN, First Publish Date - 2022-01-27T05:28:14+05:30
చదువు నేర్పించిన గురువులు, తల్లిదండ్రుల ఆశీర్వాదంతోనే తనకు అత్యున్నతమైన నైటింగేల్ ఆప్ ఇండియా అవార్డును రాష్ట్రపతి రామ్నాథ్కోవిద్ చేతుల మీదుగా సీకరించినట్లు బ్రిగేడియర్ సరస్వతి తెలిపారు.
పుంగనూరు, జనవరి26: చదువు నేర్పించిన గురువులు, తల్లిదండ్రుల ఆశీర్వాదంతోనే తనకు అత్యున్నతమైన నైటింగేల్ ఆప్ ఇండియా అవార్డును రాష్ట్రపతి రామ్నాథ్కోవిద్ చేతుల మీదుగా సీకరించినట్లు బ్రిగేడియర్ సరస్వతి తెలిపారు. బుధవారం స్థానిక బాలికల హైస్కూల్లో జరిగిన గణతంత్ర వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుంగనూరులో పుట్టిపెరిగిన తాను తల్లిదండ్రులు డాక్టర్ వేణుగోపాల్, సుజన ఆశలయాలతో ఆర్మీలో నర్సుగా చేరి బ్రిగేడియర్ పదవిలో ఉంటూ భారత దేశ సైనికులకు సేవలు అందిస్తున్నట్లు వివరించారు. తాను ఇదే పాఠశాలలో చదివానని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు అదే పాఠశాలలో జాతీయగీతాన్ని ఆలాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఆమెను ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం తిరుమలమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-27T05:28:14+05:30 IST