ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఐ జిల్లా సభలను విజయవంతం చేయండి

ABN, First Publish Date - 2022-08-20T06:12:22+05:30

చిత్తూరు నగరంలో ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే సీపీఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రామానాయుడు పిలుపుని చ్చారు.

సమావేశంలో మాట్లాడుతున్న రామానాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలమనేరు, ఆగస్టు 19: చిత్తూరు నగరంలో ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే సీపీఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రామానాయుడు పిలుపుని చ్చారు. శుక్రవారం పలమనేరులో  సీపీఐ నాయకుడు చెన్నకేశవులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో  రామానాయుడు మాట్లాడుతూ... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు కావస్తున్నా ప్రజలకు చేసింది శూన్యమన్నారు. ప్రజలకు అర్థంకాని భాషలో పేర్లు పెడుతూ సంక్షేమ పథకాలు పేరుతో ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 17 మంది ప్రధాన మంత్రులు అయ్యారని, ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు కృషి చేశారే తప్ప ఉన్న వాటిని ఆదాని, అంబానీలకు అమ్మిన ఏకైన ప్రధాని మోదీ అని విమర్శించారు. మోదీ పరిపాలనలో రైతులు, నిరుద్యోగులు, యువకులు, నిరాశకు గుర య్యారన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్‌. నాగరాజు, ఏపీ రైతు సంఘ జిల్లా అధ్యక్షులు టి.జనార్దన్‌  కూడా ప్రసంగించారు. నియోజక వర్గ కార్యదర్శి ఎం.సుబ్రమణ్యం, పట్టణ కార్య దర్శి  మంజునాథబాబు, గుర్రప్ప, శంకరప్ప, కదిరప్ప, సురేష్‌, రవి, రమేష్‌, రాము తదిత రులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-20T06:12:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising