ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ: నర్సు మృతి

ABN, First Publish Date - 2022-01-28T06:36:03+05:30

ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో రేణిగుంటకు చెందిన అమర ఆస్పత్రి నర్సు మృతిచెందింది.

రేష్మ(ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేణిగుంట, జనవరి 27: ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో రేణిగుంటకు చెందిన ఓ ప్రైవేటు ఆస్పత్రి నర్సు మృతిచెందింది. వివరాలివీ.. మండలకేంద్రంలోని గౌరీనగర్‌కు చెందిన అక్బర్‌ రెండో కుమార్తె ఎస్‌.రేష్మ(27) రేణిగుంట-కరకంబాడి మార్గంలోని అమర ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. కాగా, నైట్‌ డ్యూటీ కావడంతో గురువారం రాత్రి ఆమె విధుల నిమిత్తం తండ్రితో కలసి ద్విచక్రవాహనంలో బయలుదేరింది. ఇదే మార్గంలోని రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్దకు రాగానే, కడప వైపు వెళ్తున్న ఓ లారీ వెనుక నుంచి వీరి వాహనాన్ని ఢీకొంది. దీంతో రేష్మ తలపై లారీచక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే ఆమె మృతిచెందింది. అక్బర్‌ ఎడమవైపు పడడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. సమాచారం అందుకున్న రేణిగుంట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, మృతదేహాన్ని ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-01-28T06:36:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising