ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంకన్న సన్నిధిని నిత్య వివాదాల కేంద్రంగా మార్చేశారు: Lokesh

ABN, First Publish Date - 2022-06-09T18:28:24+05:30

తిరుమల పవిత్రతను పక్కా ప్రణాళికతో వైసీపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందని నారా లోకేష్ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: తిరుమల (Tirumala) పవిత్రతను పక్కా ప్రణాళికతో వైసీపీ (YCP) ప్రభుత్వం దెబ్బతీస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్.. వెంకన్న సన్నిధిని నిత్య వివాదాల కేంద్రంగా మార్చేశారని ఆరోపించారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుని అనేక ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఇప్పుడు ఏకంగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు తనకు గది కేటాయించలేదంటూ టీటీడీ ఉద్యోగి సీనియర్ అసిస్టెంట్ వెంకట రత్నంపై దుర్భాషలాడుతూ భౌతిక దాడి చేశాడన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భక్తులకు, సిబ్బందికి రక్షణ కల్పించ లేకపోవడం టీటీడీ, ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. ఉద్యోగిపై దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులపై కఠిన చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-06-09T18:28:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising