లేఅవుట్ పనులు వేగవంతం చేయాలి
ABN, First Publish Date - 2022-01-22T05:44:03+05:30
జగనన్న లేఅవుట్లో పనులను వేగవంతం చేయాలని శ్రీకాళహస్తి పురపాలకసంఘ కమిషనర్ బాలాజీ నాయక్ సూచించారు.
శ్రీకాళహస్తి, జనవరి 21: జగనన్న లేఅవుట్లో పనులను వేగవంతం చేయాలని శ్రీకాళహస్తి పురపాలకసంఘ కమిషనర్ బాలాజీ నాయక్ సూచించారు. పట్టణ శివారులోని ఊరందూరు వద్ద చేపడుతున్న జగనన్న లేఅవుట్ను శుక్రవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఇంటిస్థలంతో పాటు ఇల్లు కట్టించి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ కాలనీల స్థితిగతులపై ఎప్పటికపుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రతిఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిధులు వెచ్చించి ఇళ్ల నిర్మాణం చేపడుతోందని క్షేత్రస్థాయిలో ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకుని ప్రభుత్వ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. కాంట్రాక్టర్లు త్వరగా పనులు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో పురపాలక సంఘ హౌసింగ్ అధికారులు వెంకటరమణ, సింధు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-22T05:44:03+05:30 IST