AP News: కుప్పం ఘటన అంత పెద్దదేం కాదు : డీజీపీ
ABN, First Publish Date - 2022-09-03T00:41:15+05:30
Amaravathi: టీడీపీ(TDP) అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) కుప్పం (Kuppam) నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై డీజీపీ (DGP) రాజేంద్రనాథ్ రెడ్డి వివరణ ఇచ్చారు. కుప్పం ఘటన శాంతిభద్రతలను ఇబ్బంది పెట్టేంత పెద్దదికాదని ఆయన పేర్కొన్నారు. కుప్పం ఘటనలో పాల్గొన్నవారు స్థానికులేనని
Amaravathi: టీడీపీ(TDP) అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) కుప్పం (Kuppam) నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై డీజీపీ (DGP) రాజేంద్రనాథ్ రెడ్డి వివరణ ఇచ్చారు. కుప్పం ఘటన శాంతిభద్రతలను ఇబ్బంది పెట్టేంత పెద్దదికాదని ఆయన పేర్కొన్నారు. కుప్పం ఘటనలో పాల్గొన్నవారు స్థానికులేనని తెలిపారు. చంద్రబాబుకు ఎన్ఎస్జీ సెక్యూరిటీ పెంచడం, తగ్గించడం అనేది.. వచ్చే ఇన్పుట్స్పై ఆధారపడి ఉంటుందన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై సీఐడీ విచారణ జరుగుతోందన్నారు. సెప్టెంబర్ 11న సీపీఎస్పై ఉద్యోగుల సమ్మె గురించి తమకు ఇంకా అభ్యర్థన రాలేదని, వచ్చాకా అనుమతివ్వాలా? వద్దా ఆలోచిస్తామన్నారు. కుప్పంలో టీడీపీ నేతలు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చిత్తూరు ఎస్పీ తెలిపారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేశామన్నారు.
Updated Date - 2022-09-03T00:41:15+05:30 IST