ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాట్పాడి - తిరుపతి ప్యాసింజర్‌ రద్దు

ABN, First Publish Date - 2022-01-22T05:17:16+05:30

కొవిడ్‌ ఉధృతితో పాటు పాటు ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గడంతో కాట్పాడి - తిరుపతి మధ్య నడిచే ప్యాసింజర్‌ రైలు రెండు సర్వీసులను శుక్రవారం నుంచి సోమవారం వరకు రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 21: కొవిడ్‌ ఉధృతితో పాటు పాటు ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గడంతో కాట్పాడి - తిరుపతి మధ్య నడిచే ప్యాసింజర్‌ రైలు రెండు సర్వీసులను శుక్రవారం నుంచి సోమవారం వరకు రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాట్పాడిలో ఉదయం 6 గంటలకు బయలుదేరి చిత్తూరు, పాకాల మీదుగా 8గంటలకు తిరుపతికి చేరే ప్యాసింజర్‌ సర్వీస్‌ రద్దయింది. అదేవిధంగా తిరుపతిలో రాత్రి 7.30 గంటలకు బయలుదేరి కాట్పాడికి 9.30 గంటలకు చేరే సర్వీస్‌ రద్దయింది. కాగా, కాట్పాడిలో మధ్యాహ్నం 3గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తిరుపతికి చేరే సర్వీసు, తిరుపతిలో ఉదయం 6.40 గంటలకు బయలుదేరి 8.40 గంటలకు కాట్పాడికి చేరే సర్వీసు యధావిధిగా కొనసాగుతాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-01-22T05:17:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising