వైభవంగా కంచి గరుడసేవ
ABN, First Publish Date - 2022-05-16T06:54:43+05:30
నగరి పట్టణంలోని టీటీడీ అధీనంలో ఉన్న కరియమాణిక్యస్వామి ఆలయంలో ఆదివారం కంచి గరుడసేవ వైభవంగా జరిగింది.
నగరి, మే 15: నగరి పట్టణంలోని టీటీడీ అధీనంలో ఉన్న కరియమాణిక్యస్వామి ఆలయంలో ఆదివారం కంచి గరుడసేవ వైభవంగా జరిగింది. పట్టువస్త్రాల అలంకరణలో గరుడవాహనాన్ని అధిరోహించిన శ్రీవారు మాడవీధుల్లో విహరించారు. శ్రీవారికి భక్తులు కొబ్బరికాయలు కొట్టి పుష్ప, ఫలాలను సమర్పించి కర్పూర హారతులు ఇచ్చారు. స్వామివారిని దర్శించుకుని గరుడవాహన పల్లకి కింద దాటుకుంటూ వెళ్లారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ లోకల్ టెంపుల్ డీవైఈవో నాగరత్నం, ఏఈవో దొరైరాజ్, సూపరింటెండెంట్ రమే్షకుమార్, స్థానిక ఆలయ అధికారులు వెంకటరమణ, ప్రధాన అర్చకులు మారుతిప్రసాద్, అర్చకులు ధన్వంత్రి ఆచార్యులు, రమేష్ ఆచార్యులు, ఆలయ సలహా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-16T06:54:43+05:30 IST