ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కామాక్షి అలంకరణలో మరగదాంబిక

ABN, First Publish Date - 2022-09-28T06:05:45+05:30

మండల పరిధిలోని సురుటుపల్లి పళ్లికొండేశ్వరాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన మంగళవారం మరగ దాంబిక అమ్మవారు కంచి కామాక్షి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగలాపురం, సెప్టెంబరు 27: మండల పరిధిలోని సురుటుపల్లి పళ్లికొండేశ్వరాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన మంగళవారం మరగ దాంబిక అమ్మవారు కంచి కామాక్షి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయ ఆవరణలో పరివార దేవతలకు ఆలయ ప్రధాన అర్చకులు కార్తికేశన్‌ గురుక్కల్‌ అభిషేకాలు చేశారు. సాయంత్రం ఆలయంలోని మూల స్థాన దేవతా మూర్తులు మరగదాంబికా అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు చేసి దీప, ధూప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రదోష మం డపంలో అమ్మవారిని కామాక్షిగా అలంకరించి వేద పండితులు వేద మంత్రాల నడుమ అమ్మవారికి ఊంజల్‌ సేవ నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భజన బృందాల నడుమ అత్యంత వైభవంగా ప్రాకారోత్సవం జరిపించారు. ఈ పూజలకు చెన్నైకి చెందిన భారతి కుటుంబసభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమాలను ఆలయ చైర్మన్‌ ఏవీఎం. మునిశేఖర్‌రెడ్డి, ఈవో రామచంద్రారెడ్డి, బోర్డు సభ్యులు పర్యవేక్షించారు. 

Updated Date - 2022-09-28T06:05:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising