ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం !

ABN, First Publish Date - 2022-08-19T05:24:53+05:30

అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని పథకం ప్రకారం కబ్జాచేయడానికి కొందరు చోటా నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు.

అక్రమణకు గురవుతున్న కుంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రాత్రికి రాత్రే మట్టితోలి చదును చేస్తున్న నాయకులు

 గంగవరం, ఆగస్టు 18: అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని పథకం ప్రకారం కబ్జాచేయడానికి కొందరు చోటా నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. పలమనేరు పట్టణానికి అనుకొని గంగవరం మండల పరిధిలో సర్వేనెంబరు 671లో సుమారు 22 సెంట్ల కుంటపరంబోకు స్థలం ఉంది. ఈ స్థలానికి సుమారు 100 మీటర్ల దూరంలో మదనపల్లె జాతీయ రహదారి కూడా ఉంది. ఈ స్థలం చుట్టూ ఇప్పటికే భవనాలు సైతం నిర్మించేశారు. ప్లాట్ల ధరలు అధికంగా పలుకుతుండడంతో, ఇక్కడ భూములకు భారీగా డిమాండ్‌ ఉంది. దీంతో గంగవరం పంచాయతీ పరిధిలోని ఓ చోటా నాయకుడి కన్ను ఈ 22 సెంట్ల కుంటపై పడింది. అంతే మూడు రోజుల నుంచి రాత్రికి రాత్రే ట్రాక్టర్లతో మట్టి తోలి కుంటను పూడ్చివేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. కొంతమంది నాయకుల అండదండలతో ఈ పని చేస్తున్నా.. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ 22 సెంట్ల భూమి బహిరంగ మార్కెట్‌లో కోటి రూపాయలకు పైగానే ఉంది. దీనిపై గంగవరం తహసీల్దార్‌ మురళిని వివరణ కోరగా... ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని, ఈ కుంట లో మట్టిని తరలించిన వారిని గుర్తించి చట్టపరచర్యలు తీసుకొనేలా నివేదిక సమర్పించాలని వీఆర్‌ఓను ఆదేశించామన్నారు. ప్రభుత్వ ఆస్తుల కబ్జాకు పాల్పడితే ఎంతటివారినైనా వదిలేది లేదని చెప్పారు. 

Updated Date - 2022-08-19T05:24:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising