ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలేశుడి సేవలో తెలంగాణ గవర్నర్‌

ABN, First Publish Date - 2022-01-17T07:10:17+05:30

తిరుమల శ్రీవారిని ఆదివారం తెలంగాణ గవర్నర్‌ తమిళసై దర్శించుకున్నారు.

శ్రీవారి ఆలయం వెలుపల తమిళసై
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని ఆదివారం తెలంగాణ గవర్నర్‌ తమిళసై దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో మహద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లిన ఆమె ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని, తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. వైకుంఠ ద్వార ప్రవేశ అనంతరం రంగనాయక మండపానికి చేరుకున్న గవర్నర్‌కు వేదపండితులు ఆశీర్వచనం చేయగా, టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి శ్రీవారి తీర్థప్రసాదాలు, నూతన ఏడాది డైరీ, క్యాలెండర్లు అందజేశారు. కాగా, దర్శనం తర్వాత తమిళసై ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ బాగుండాలని, కరోనా నుంచి బయటపడాలని శ్రీవారిని కోరుకున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచించారు.

Updated Date - 2022-01-17T07:10:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising