ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా 500 పార్థివలింగాలకు అభిషేకాలు

ABN, First Publish Date - 2022-11-23T23:30:38+05:30

కార్తీక మాసం బహుళ అమావాస్య రోజైన బుధవారం పుంగనూరు కోనేరులో 500 పార్థివ లింగాలకు ఏకకాలంలో అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు.

కోనేరులో పార్థివలింగ పూజ చేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుంగనూరు, నవంబరు 23: కార్తీక మాసం బహుళ అమావాస్య రోజైన బుధవారం పుంగనూరు కోనేరులో 500 పార్థివ లింగాలకు ఏకకాలంలో అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు అన్నపూర్ణాదేవి సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. అక్కడినుంచి పుష్కరిణిని వద్దకు స్వామిఅమ్మవార్లను వేంచేపు చేశారు. అనంతరం పుష్కరిణిలో ఏకకాలంలో అన్నిరకాల అభిషేకాలు, రుద్రం, నమకచమక, ప్రాణప్రతిష్ట సహిత కాలాభిషేకాలు శాస్త్రోక్తంగా చేట్టారు. మహిళలు, భక్తులు కోనేరులో దీపారాధన చేస్తూ శివనామస్మరణ చేశారు. ఆలయ ప్రాకారం చుట్టూ ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఈసందర్భంగా అర్చకులు పార్థివ లింగపూజ ప్రాముఖ్యాన్ని వివరించారు.

Updated Date - 2022-11-23T23:30:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising