ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాణిపాకంలో జ్వాలాతోరణం

ABN, First Publish Date - 2022-11-08T01:10:37+05:30

కాణిపాకం వరసిద్ధుడి ఆలయానికి అనుబంధ మరగదాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయంలో సోమవారం జ్వాలా తోరణాన్ని నిర్వహించారు.

మణికంఠేశ్వర ఆలయంలో జ్వాలా తోరణం నిర్వహిస్తున్న అర్చకులు - చిత్తూరులోని అగస్త్యేశ్వరాలయంలో దీపాలు వెలిగిస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐరాల(కాణిపాకం), నవంబరు 7: కాణిపాకం వరసిద్ధుడి ఆలయానికి అనుబంధ మరగదాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయంలో సోమవారం జ్వాలా తోరణాన్ని నిర్వహించారు. తొలుత ప్రధాన ఆలయం నుంచి పూజాద్రవ్యాలను మణికంఠేశ్వర స్వామి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో స్వామికి రుద్రాభిషేకం చేశారు. సాయంత్రం ఆలయంలో కార్తీక దీపోత్సవంలో భాగంగా లక్ష దీపారాధన నిర్వహించారు. అనంతరం ఆలయాన్ని సహస్ర దీపాలతో అలంకరించారు. రాత్రి మణికంఠేశ్వరుడికి జ్వాలా తోరణాన్ని నిర్వహించారు. మణికంఠేశ్వర స్వామి ఆలయంలో జరిగే కార్తీక పౌర్ణమి వేడుకలను తిలకించడానికి వందలాదిగా భక్తులు తరలివచ్చారు. రాత్రి శివపార్వతుల ఉత్సవమూర్తులను కాణిపాక పురవీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీనివాస్‌, శ్రీధర్‌, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌, బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-08T01:10:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising