గురుకుల ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపు
ABN, First Publish Date - 2022-04-06T05:28:27+05:30
ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు తేదీ గడువును ఈ నెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ పి.విశ్వరాణి తెలిపారు.
నాయుడుపేట టౌన్: ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు తేదీ గడువును ఈ నెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ పి.విశ్వరాణి తెలిపారు. నాయుడుపేట ఎల్ఎసాగరంలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకులంలో మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. 4వ తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Updated Date - 2022-04-06T05:28:27+05:30 IST