ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నారాయణపురం తాండా వద్ద ఏనుగుల మంద

ABN, First Publish Date - 2022-10-01T05:23:21+05:30

రామకుప్పం మండలంలోని అటవీ సమీప గ్రామాల ప్రజలను ఏనుగులు భయాందోళనకు గురిచేస్తున్నాయి.

నారాయణపురంతాండా వద్ద ఏనుగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామకుప్పం, సెప్టెంబరు 30: మండలంలోని అటవీ సమీప గ్రామాల ప్రజలను ఏనుగులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఏడు ఏనుగుల మంద  రెండు రోజులుగా సింగసముద్రం, జీడిమాకులపల్లెల సమీప పంటపొలాలను ధ్వంసం చేశాయి. అటవీశాఖ అధికారులు, సిబ్బంది వాటిని గురువారం రాత్రి ట్రాకర్స్‌ సాయంతో అటవీ లోతట్టు ప్రాంతానికి తరిమారు. అవి తిరిగి శుక్రవారం సాయంత్రం చీకటి పడగానే  రామకుప్పం- 89పెద్దూరు రహదారి దాటి నారాయణపురం తాండా సమీప పొలాల్లో హల్‌చల్‌ చేశాయి.  రైతు కుమార్‌నాయక్‌కు చెందిన వరి పొలంలో పైరును ధ్వంసం చశాయి. ప్రజలు ఎక్కడకు వెళ్ళినా చీకటి పడకముందే  గ్రామాలకు చేరుకోవాలని, రైతులెవరూ రాత్రిపూట పొలాల వద్దకు వెళ్లవద్దంటూ అటవీ శాఖ అధికారులు సూచించారు. 

Updated Date - 2022-10-01T05:23:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising