121 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి : కలెక్టర్
ABN, First Publish Date - 2022-05-17T06:51:48+05:30
వందశాతం భూ రికార్డుల స్వఛ్చీకరణలో భాగంగా ఇంతవరకు 121 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి అయిందని, త్వరలో మరో 19 గ్రామాల్లో చేపడ తామని కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, మే 16: వందశాతం భూ రికార్డుల స్వఛ్చీకరణలో భాగంగా ఇంతవరకు 121 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి అయిందని, త్వరలో మరో 19 గ్రామాల్లో చేపడ తామని కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ నుంచి జేసీ వెంకటేశ్వర్తో కలిసి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. సర్వే ఆఫ్ ఇండియా శాఖ 12 డ్రోన్ల సహకారంతో పలమనేరు, కుప్పంలో, ప్రయివేటు ఏజెన్సీల ద్వారా నగరి రెవెన్యూ డివిజన్ పరిధిలో సర్వే జరుగుతోందని వెల్లడించారు. 400 గ్రామాల్లో ఫ్రీ డ్రోన్ సర్వే లక్ష్యం కాగా వర్షాల కారణంగా ఎక్కడా ఆగరాదని ఆర్డీవోలను హెచ్చరించారు.
Updated Date - 2022-05-17T06:51:48+05:30 IST