నేలకూలిన విద్యుత్ స్తంభాలు
ABN, First Publish Date - 2022-09-29T05:39:52+05:30
స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో కలెక్టర్ బంగ్లా అనుకుని ఉన్న ట్రాఫిక్ సిగ్నిల్, విద్యుత్ స్తంభాలు బుధవారం రాత్రి నేలకూలాయి.
చిత్తూరు రూరల్, సెప్టెంబరు 28: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో కలెక్టర్ బంగ్లా అనుకుని ఉన్న ట్రాఫిక్ సిగ్నిల్, విద్యుత్ స్తంభాలు బుధవారం రాత్రి నేలకూలాయి. ఆ సమయంలో రోడ్డుపై ఎవరు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. భారీ వర్షం కారణంగా నేల బాగా నానడం, గాలి వీయడంతో నేలకూలినట్లు తెలుస్తోంది. నగర సమీపంలోని ఇరువారంలోనూ విద్యుత్ స్తంభం పక్కనే ఉన్న ఇంటిపై కూలింది. దుస్థితిలో ఉంది తొలగించాలని ప్రజలు కోరినా అధికారులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో అది నేల కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రెండు రోజుల పాటు ఆ ప్రాంత ప్రజలు చీకట్లో మగ్గాల్సి వచ్చింది. కట్టమంచిలోనూ ట్రాఫిక్ సిగ్నల్ నేలకూలడానికి సిద్ధంగా ఉంది.
Updated Date - 2022-09-29T05:39:52+05:30 IST