మహిళతో దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ సస్పెన్షన్
ABN, First Publish Date - 2022-01-24T04:59:58+05:30
నగదు చోరీ విషయంలో మహిళా నిందితురాలు ఉమామహేశ్వరితో దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ సురేష్బాబును డీఐజీ సెంథిల్కుమార్ సస్పెండ్ చేశారు.
చిత్తూరు, జనవరి 23: నగదు చోరీ విషయంలో మహిళా నిందితురాలు ఉమామహేశ్వరితో దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ సురేష్బాబును డీఐజీ సెంథిల్కుమార్ సస్పెండ్ చేశారు. ఈ నెల 18న తన ఇంట్లో పనిచేస్తున్న ఉమామహేశ్వరి రూ.2 లక్షలు నగదు చోరీ చేసిందని జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాలరెడ్డి ఒకటో పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ సమయంలో పోలీసులు తనను కొట్టి హింసించారని ఉమామహేశ్వరి ఆరోపించింది. దీనిపై స్పందించిన డీఐజీ సెంథిల్కుమార్ ఘటనకు కారణమైన కానిస్టేబుల్ సురేష్బాబును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఏఎస్పీ డీఎన్ మహేష్ను ఆదేశించారు.
Updated Date - 2022-01-24T04:59:58+05:30 IST