Tirupati: సీఎం Jagan పర్యటనలో ఉద్రిక్తత
ABN, First Publish Date - 2022-06-23T19:33:30+05:30
Tirupati: సీఎం జగన్ (CM Jagan) పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Tirupati: సీఎం జగన్ (CM Jagan) పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వకుళామాత ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రిని కలిసేందుకు పాతకాల్వ గ్రామస్తులు ప్రయత్నించారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ గ్రామస్తులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, గ్రామస్తుల మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సమస్యలను సీఎంకు చెప్పుకుందామని వస్తే పోలీసులు అడ్డుకోవడంపై పాతకాల్వ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే తిరుపతి పేరూరు గ్రామం వకుళామాత ఆలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జాతీయ రహదారిపై విద్యార్థి సంఘాల నేతలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. సీఎం కాన్వాయ్ను అడ్డుకుంటారనే ఉద్దేశంతో రామానుజపల్లి చెక్పోస్టు వద్ద వారిని బలవంతంగా అరెస్టు చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అగ్నిపథ్కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని, జాబ్ క్యాలండర్ విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
Updated Date - 2022-06-23T19:33:30+05:30 IST