ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chittoor: కుటుంబంపై వైసీపీ నాయకుల దౌర్జన్యం

ABN, First Publish Date - 2022-04-11T15:03:53+05:30

జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలం ఏజ్జు పల్లి పంచాయతీ పిడతల బయలు గ్రామంలో ఓ కుటుంబంపై వైసీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలం ఏజ్జు పల్లి పంచాయతీ పిడతల బయలు గ్రామంలో ఓ కుటుంబంపై వైసీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ‘‘నేను ఓడిపోయిన ఇక్కడ నేనె సర్పంచ్‌ను. ఎవరికైనా నా మాటే శాసనం’’ అంటూ మాజీ సర్పంచ్ నాయణి రెడ్డి రెచ్చిపోయాడు. దాయాదుల మధ్య గొడవకు  వైసీపీ నాయకుడు ఆద్యం పోశాడు. కలెక్టర్  ఇచ్చిన ఇంటి స్థలంలో గుడిసె నిర్మించుకున్న లక్ష్మమ్మ కుటుంబంపై గత రాత్రి వైసీపీ నాయకులు దాడి చేశారు. చెంగారెడ్డి అనే నాయుడు 50 మంది అనుచరులతో కలిసి ఇంటి పైకి కట్టలు, రాడ్లతో దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిండు గర్భిణీ అని కూడా చూడకుండా కర్రలతో కొట్టి కాలుతో  తన్నారని కుటుంబసభ్యులు తెలిపారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2022-04-11T15:03:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising