Chittoor: విద్యుత్ వైర్లు తగిలి ఏనుగు మృతి
ABN, First Publish Date - 2022-02-12T16:08:15+05:30
జిల్లాలోని తవణంపల్లి మండలం మాధవరం ఎస్టీ కాలనీ సమీపంలో విద్యుత్ వైర్లు మీద పడి ఏనుగు మృతి చెందింది.
చిత్తూరు: జిల్లాలోని తవణంపల్లి మండలం మాధవరం ఎస్టీ కాలనీ సమీపంలో విద్యుత్ వైర్లు మీద పడి ఏనుగు మృతి చెందింది. విద్యుత్ స్తంభాన్నిఢీ కొనడంతో స్తంభం రెండుగా విరిగి లైను ఏనుగుపై పడింది. దీంతో ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
Updated Date - 2022-02-12T16:08:15+05:30 IST