ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్యకర్తకు చంద్రబాబు భరోసా

ABN, First Publish Date - 2022-03-08T06:15:36+05:30

కుప్పంలో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలకు గురైన మురళి అనే కార్యకర్తకు ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భరోసా ఇచ్చారు.

మురళితో మాట్లాడుతున్న చంద్రబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుప్పం, మార్చి 7: కుప్పంలో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలకు గురైన మురళి అనే కార్యకర్తకు ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇటీవల కుప్పంలో అధికార పార్టీ నాయకుల అక్రమ దందాలపై మురళి వారిని ప్రశ్నించారు. దీనిపై ఆగ్రహించిన నాయకుల అనుచరులు మురళిపై దాడి చేసి గాయపరిచారు. దీనిపై టీడీపీ శ్రేణులు ఆందోళన చేయగా,  పోలీసుస్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో మురళి భార్యాబిడ్డలతో  ఆదివారం అమరావతి వెళ్లి పార్టీ కార్యాలయంలో చంద్రబాబును కలిశారు. తనపై వైసీపీ నాయకులు చేసిన దాడిని, దౌర్జనాన్ని వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... కుప్పం నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అరాచకాలు ఎక్కువైపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి అక్రమాలను ఎదిరించినందుకు మురళిని అభినందించారు. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని, ఎవరూ భయపడవద్దని భరోసా ఇచ్చారు. అవసరమైతే తానే నేరుగా కుప్పం వచ్చి వారి తరఫున నిలబడి ఆందోళన చేస్తానన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, కష్టపడే ప్రతివొక్క కార్యకర్తకూ మంచి రోజులు వస్తాయని, వారిని గుర్తుంచుకుని అవకాశాలు ఇస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated Date - 2022-03-08T06:15:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising