భక్తసంద్రంగా బోయకొండ
ABN, First Publish Date - 2022-03-14T05:26:56+05:30
ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ ఆదివారం భక్తజనంద్రమైంది. ఉదయం అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి, అమ్మవారికి ప్రీతికరమైన వేపాకు తోరణలతో ఆలయాన్ని అలంకరించారు.
చౌడేపల్లె, మార్చి 13: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ ఆదివారం భక్తజనంద్రమైంది. ఉదయం అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి, అమ్మవారికి ప్రీతికరమైన వేపాకు తోరణలతో ఆలయాన్ని అలంకరించారు.అభిషేకాలు అర్చనలు చేసి, స్వర్ణాభరణాలతో, పూలతో అలంకరించి, ధూప దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిచారు.ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.ఉదయం నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు క్యూలైన్లలో రద్దీ కొనసాగింది. ఆలయ చైర్మన్ మిద్దింటి శంకర నారాయణ, ఈవో చంద్రమౌళి భక్తులకు ఏర్పాట్లు చేశారు.
Updated Date - 2022-03-14T05:26:56+05:30 IST