శ్రీవారి కొండపై ఆంక్షలు తొలగించండి: Bjp leader
ABN, First Publish Date - 2022-02-26T13:33:11+05:30
కొవిడ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కొండపై ఆంక్షలను తొలగించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
తిరుమల: కొవిడ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కొండపై ఆంక్షలను తొలగించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు 72 గంటల పాటు తిరుపతిలో ఉండడలేక తీవ్ర ఇబ్బందలు పడుతున్నారన్నారు. నిబంధనలు పేరుతో భక్తులను శ్రీవారికీ దూరం చెయొద్దని కోరారు. భక్తులను గతంలోలా తిరుమలకు అనుమతించాలన్నారు. హోటల్స్ను ఎత్తి వేస్తామంటూ పాలకమండలి తీసుకున్న నిర్ణయం ఆచరణ సాధ్యం కాదని... టీటీడీ వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీ ధార్మిక క్షేత్రం అని... ధనార్జన క్షేత్రం కాదని అన్నారు. ఆర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంచలంటూ టీటీడీ నిర్ణయాన్ని వ్యతిరేకస్తున్నామని తెలిపారు. ధరల పెంపు నిర్ణయాన్ని టీటీడీ వెన్నకి తీసుకోవాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
Updated Date - 2022-02-26T13:33:11+05:30 IST