శాస్త్రోక్తంగా భీష్మ ఏకాదశి వేడుకలు
ABN, First Publish Date - 2022-02-13T05:40:58+05:30
శ్రీకాళహస్తీశ్వరాలయంలో శాస్త్రోక్తంగా భీష్మ ఏకాదశి వేడుకలను నిర్వహించారు.
పురవీధుల్లో స్వామి, అమ్మవార్ల ఊరేగింపు
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 12: శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శాస్త్రోక్తంగా భీష్మ ఏకాదశి వేడుకలను నిర్వహించారు. ఉదయం నుంచి వేద పండితులు ఆలయ అలంకార మండపంలో శ్రీవళ్లి, దేవసేన సమేత కుమారస్వామి ఉత్సవమూర్తులకు పలురకాల అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి మేళతాళాలు, మంగళవాయిద్యాల సందడి నడుమ ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. సాంప్రదాయం మేరకు విజ్ఞానగిరి వద్ద కొలువుదీర్చి, పూజల తర్వాత శ్రీకాళహస్తీశ్వరాలయానికి చేర్చారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-02-13T05:40:58+05:30 IST