వరసిద్ధుడి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
ABN, First Publish Date - 2022-10-07T06:13:48+05:30
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీనివాస్ గురువారం కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు.
ఐరాల(కాణిపాకం), అక్టోబరు 6: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీనివాస్ గురువారం కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు. ఏఈవో రవీంద్రబాబు ఆయన్ను ఆహ్వానించి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. వేదాశీర్వాద మండపంలో ఆశీర్వదించి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు. సూపరింటెండెంట్ కోదండపాణి, ఆలయ ఇన్స్పెక్టర్ రమేష్ పాల్గొన్నారు.
Updated Date - 2022-10-07T06:13:48+05:30 IST