ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ABN, First Publish Date - 2022-11-21T01:12:14+05:30

ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఎస్‌ఆర్‌పురం మండలం 49.కొత్తపల్లెమిట్ట చర్చి వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

హేమశేఖర్‌ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకరి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు

శ్రీరంగరాజపురం, నవంబరు 20: ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఎస్‌ఆర్‌పురం మండలం 49.కొత్తపల్లెమిట్ట చర్చి వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ షేక్షావలి చెప్పిన వివరాల మేరకు.. వెదురుకుప్పం మండలం మారేపల్లికి చెందిన కాలేయ్య కుమారుడు హేమశేఖర్‌(20), అయ్యప్ప (22) ఆదివారం రాత్రి చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో ఉన్న బంధువులను చూసేందుకు బైక్‌పై వెళుతున్నారు. ఎస్‌ఆర్‌పురం మండలం 49.కొత్తపల్లెమిట్ట చర్చి వద్ద చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారిపై వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. హేమశేఖర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. అయ్యప్ప గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని హేమశేఖర్‌ మృతదేహాన్ని, గాయపడిన అయ్యప్పను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ షేక్షావలి తెలిపారు.

Updated Date - 2022-11-21T01:12:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising