ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ పాసుపుస్తకాల తయారీదారులపై చర్యలు

ABN, First Publish Date - 2022-05-28T06:35:31+05:30

పాలసముద్రం మండలంలో నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలతో బ్యాంకులో రుణాలు తీసుకున్న.. రైతు భరోసా పొందుతున్న వారిపై చర్యలు తప్పవని నగరి ఆర్డీవో సృజన హెచ్చరించారు.

రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్న ఆర్డీవో సృజన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలసముద్రం, మే 27: పాలసముద్రం మండలంలో నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలతో బ్యాంకులో రుణాలు తీసుకున్న.. రైతు భరోసా పొందుతున్న వారిపై చర్యలు తప్పవని నగరి ఆర్డీవో సృజన హెచ్చరించారు. తహసీల్దారు కార్యాలయంలో శుక్రవారం ఆమె నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలకు సంబంధించి రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. వనదుర్గాపురం, శ్రీకావేరిరాజుపురం, సింహరాజుపురం, తిరుమలరాజు పురం, నరసింహరాజుపురం పంచాయతీల్లో నకిలీ పాసుపుస్తకాల ద్వారా లబ్ధిపొందుతున్నట్లు మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో జేసీ వెంకటేశ్వర్‌ ఆదేశాలపై తాను రికార్డులను పరిశీలిస్తున్నట్లు ఆమె తెలిపారు. మూడు రోజులపాటు రికార్డులను పరిశీలించి నకిలీ లబ్ధిదారులను గుర్తించి కలెక్టర్‌, జేసీలకు నివేదిక ఇస్తామన్నారు. నకిలీ పాసుపుస్తకాల తయారీకి సహకరించిన రెవన్యూ అధికారులపైనా చర్యలు చేపడతామన్నారు. తహసీల్దార్‌ భాగ్యలత పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T06:35:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising