బలహీనపడ్డ అల్పపీడనం
ABN, First Publish Date - 2022-11-25T00:03:54+05:30
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారి బలహీనపడినా, అటు రైతుల్లో ఇటు ప్రజల్లో ఆందోళన వీడలేదు. గత రాత్రి జిల్లావ్యాప్తంగా వర్షం దంచేసింది.
కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
జిల్లాను కమ్మేసిన మబ్బు
చిత్తూరు కలెక్టరేట్, నవంబరు 24: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారి బలహీనపడినా, అటు రైతుల్లో ఇటు ప్రజల్లో ఆందోళన వీడలేదు. గత రాత్రి జిల్లావ్యాప్తంగా వర్షం దంచేసింది. గురువారం కాసేపు చిరుజల్లులు, కాసేపు ఎండతీవ్రత కొనసాగింది. జిల్లాలోని 31 మండలాల్లో ఓ మోస్తరు నుంచి బలమైన వర్షం కురిసింది. అత్యధికంగా బైరెడ్డిపల్లెలో 39.2మి.మీ, అత్యల్పంగా నిండ్రలో 1.2 మిమీ వర్షం నమోదైంది. రొంపిచెర్లలో 30.4, కార్వేటినగరం 30.2, వి.కోట 30.2, రామకుప్పం 28.2, గంగవరం 24.6, శ్రీరంగరాజపురం 21.6, పుంగనూరు 21.2, గుడిపాల 18.2, యాదమరి 17.2, పెనుమూరు 14.6, సోమల 14.2, బంగారుపాళ్యం 14.2, విజయపురం 12.8, తవణంపల్లె 12.2, సదుం 12, పెద్దపంజాణి 11.2, నగరి 10.6, గుడుపల్లె 10.6, వెదురుకుప్పం 10.2, పలమనేరు 10, పూతలపట్టు 9, శాంతిపురం 8, చౌడేపల్లి 7.4, కుప్పం 7.2, చిత్తూరు 6.4, పులిచెర్ల 4.8, ఐరాల 4.4, గంగాధరనెల్లూరు 4.2, పాలసముద్రంలో 2.8 మి.మీ వర్షం నమోదైంది.
Updated Date - 2022-11-25T00:03:57+05:30 IST