ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి

ABN, First Publish Date - 2022-08-11T06:19:49+05:30

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని జేసీ వెంకటేశ్వర్‌ పిలుపునిచ్చారు. చిత్తూరు ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జాతీయ జెండాలను పంపిణీ చేసి ఆయన మాట్లాడారు.

చిత్తూరు ఇన్‌చార్జి ఎంపీడీవోకు జాతీయ జెండాలు పంపిణీ చేస్తున్న జేసీ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

3 లక్షల జెండాలు పంపణీ చేయనున్నట్లు జేసీ వెల్లడి 

చిత్తూరు రూరల్‌, ఆగస్టు 10: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని జేసీ వెంకటేశ్వర్‌ పిలుపునిచ్చారు. చిత్తూరు ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జాతీయ జెండాలను పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. జిల్లాకు 3 లక్షల జాతీయ జెండాలను ప్రభుత్వం పంపిందన్నారు. వీటిని సచివాలయాలు ద్వారా, వలంటీర్ల సహాయంతో ప్రతి ఇంటికి చేరుస్తామన్నారు. గురు, శుక్రవారాల్లో వీటి పంపిణీని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎగుర వేసిన జాతీయ జెండా వద్ద సెల్ఫీ తీసుకొని సోషల్‌ మీడియాతో పోస్ట్‌ చేసి జాతీయ భావాన్ని చాటుకోవాలన్నారు. అలాగే గురువారం ‘హెరిటేజ్‌ వాక్‌’ పేరిట నగరంలోని పురాతన కట్టడాలు, వాటి విశిష్టతను విద్యార్థులకు,  ప్రజలకు తెలియజేసే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో రాజశేఖర్‌, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, చిత్తూరు ఎంపీడీవో శివరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T06:19:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising