ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండంత జనం

ABN, First Publish Date - 2022-05-22T07:27:49+05:30

భక్తుల రద్దీతో తిరుమల క్షేత్రం కిక్కిరిసిపోయింది. కొవిడ్‌ ప్రభావం తగ్గడంతో రెండు నెలలుగా తిరుమలకు భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.వారాంతాల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, మే 21 (ఆంధ్రజ్యోతి):భక్తుల రద్దీతో తిరుమల క్షేత్రం కిక్కిరిసిపోయింది. కొవిడ్‌ ప్రభావం తగ్గడంతో రెండు నెలలుగా తిరుమలకు భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.వారాంతాల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. శనివారం తిరుమల మొత్తం భక్తులతో కిటకిటలాడింది.శనివారం సాయంత్రం సర్వదర్శన భక్తుల మధ్య తోపులాట జరిగింది.సర్వదర్శన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్క్‌లోని షెడ్లు నిండిపోయాయి.క్యూలైన్‌ లేపాక్షి మీదుగా పీఏసీ-4 లగేజీ సెంటర్‌ నుంచి రాంభగీచ వరకు వ్యాపించింది. దీంతో శనివారం సాయంత్రం ఆస్థానమండపం వద్ద క్యూలైన్‌లోకి ప్రవేశించేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో భక్తుల మధ్య 4.30 నుంచి 6 గంటల మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి.సెక్యూరిటీ  సిబ్బంది రోప్‌ల సహాయంతో ఏపీసీ-4 వద్దనున్న లైన్‌లోకి అనుమతించారు.రద్దీ పెరుగుతున్న క్రమంలో క్యూలైన్లను, భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచారు.గదులు కేటాయించే సీఆర్వో, ఎంబీసీ, పద్మావతి, రిజిస్ర్టేషన్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లలో బారులు తీరారు. గదులు లభించని భక్తులు షెడ్లు, కార్యాలయాల ముందు, ఫుట్‌పాత్‌లు, చెట్ల కిందనే సేదదీరుతున్నారు.సోమవారం వరకూ రద్దీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Updated Date - 2022-05-22T07:27:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising