అమ్మవారికి కానుకగా గోల్డ్డాలర్
ABN, First Publish Date - 2022-08-19T07:10:51+05:30
శ్రీపద్మావతి అమ్మవారికి ఓ భక్తుడు రూ.12లక్షల విలువైన గోల్డ్ డాలర్ను కానుకగా సమర్పించారు.
తిరుచానూరు, ఆగస్టు 18: శ్రీపద్మావతి అమ్మవారికి ఓ భక్తుడు రూ.12లక్షల విలువైన గోల్డ్ డాలర్ను కానుకగా సమర్పించారు. బెంగళూరుకు చెందిన భక్తుడు హరీష్, కుటుంబ సభ్యులతో కలసి 207 గ్రాముల బరువున్న డాలర్ను డిప్యూటీ ఈవో లోకనాధంకు గురువారం అందజేశారు. కెంపులు, పుష్యరాగం పొదిగిన ఈ డాలర్ను విశేష ఉత్సవాల్లో అమ్మవారికి అలంకరించనున్నట్లు అర్చకులు తెలిపారు. ఆలయ సూపరింటెండెంట్ శేషగిరి, అర్చకుడు బాబుస్వామి, టెంపుల్ఇన్స్పెక్టర్ దాము, అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-19T07:10:51+05:30 IST