ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంకన్న దర్శనానికి 36గంటలు

ABN, First Publish Date - 2022-10-07T07:17:19+05:30

తిరుమల క్షేత్రంలో గురువారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది.

తిరుమలలోని నారాయణగిరి విశ్రాంతి భవనం వెనుక భాగంలోని రింగురోడ్డులో సర్వదర్శన భక్తుల క్యూలైన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): తిరుమల క్షేత్రంలో గురువారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. పెరటాశి మూడవ శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో, బ్రహ్మోత్సవాలు పూర్తయిన క్రమంలో గురువారం ఉదయం నుంచి తిరుమలకు భక్తుల రాక పెరిగింది. ఈక్రమంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోవడంతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు కూడా సర్వదర్శన భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం 10 గంటల సమయానికే సర్వదర్శనం క్యూలైన్‌ నారాయణ గిరి విశ్రాంతి భవనం వెనుకభాగంలో రింగ్‌రోడ్డు మీదుగా శిలాతోరణం వరకు చేరింది. సాయంత్రం 6 గంటల సమయానికి 36 గంటల దర్శన సమయం పడుతున్నట్టు టీటీడీ ప్రకటించింది.శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు నాలుగుమాడవీధులు, లడ్డూకౌంటర్‌, అఖిలాండం, అన్నప్రసాదభవనం, బస్టాండ్‌ వంటి ప్రాంతాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. అలాగే గదులకు డిమాండ్‌ భారీగా పెరిగింది.గది తీసుకోవడానికి 4నుంచి 6 గంటల సమయం పడుతోంది. తలనీలాలు సమర్పించే కల్యాణకట్టల్లోనూ భక్తులు కిక్కిరిసిపోయారు.


Updated Date - 2022-10-07T07:17:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising