ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

206 ‘జలకళ’ పనులు మంజూరు

ABN, First Publish Date - 2022-03-23T06:40:31+05:30

జలకళ పథకం కింద జిల్లాకు 206 పనులు మంజూరైనట్లు సదరన్‌ డిస్కం ఎస్‌ఈ ఓబుల్‌కొండారెడ్డి తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న సదరన్‌ డిస్కం ఎస్‌ఈ ఓబుల్‌కొండారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు రూరల్‌, మార్చి 22: జలకళ పథకం కింద జిల్లాకు 206 పనులు మంజూరైనట్లు సదరన్‌ డిస్కం ఎస్‌ఈ ఓబుల్‌కొండారెడ్డి తెలిపారు. చిత్తూరులో మంగళవారం ఆయన ఈఈలు, డీఈలతో సమావేశమయ్యారు. ఈ పథకం ద్వారా రైతులకు ఉచితంగా బోరు, విద్యుత్‌ కనెక్షన్లు ఇస్తామన్నారు. ఈ 206 పనులను ఈ సంవత్సరంలోపు పూర్తి చేయాలన్నారు. 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న 13వేల వ్యవసాయ సర్వీసులను సీనియారిటీ వారీగా ఇస్తామన్నారు. ఈ సమావేశంలో డీఈలు మునిచంద్ర, శేషాద్రి, జ్ఞానేశ్వర్‌, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 


తిరుపతిలోనే ఎస్‌ఈ కార్యాలయం

విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ కార్యాలయం తిరుపతిలోనే కొనసాగుతుందని ఎస్‌ఈ ఓబుల్‌కొండారెడ్డి స్పష్టం చేశారు. జిల్లా విభజన నేపథ్యంలో ఎస్‌ఈ కార్యాలయం చిత్తూరుకు వస్తుందనే ప్రచారంలో నిజం లేదన్నారు. ఇప్పటిలానే డివిజన్లు, అధికారులు యథాస్థానంలో కొనసాగుతారని, తిరుపతి నుంచే మూడు జిల్లాలను పర్యవేక్షిస్తామన్నారు.

Updated Date - 2022-03-23T06:40:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising