కన్నెర్ర చేస్తే బయటకు రాలేరు.. వైసీపీ నేతలకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
ABN, First Publish Date - 2022-07-07T01:22:32+05:30
మదనపల్లె (Madanapalle)లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పర్యటిస్తున్నారు. టీడీపీ మినీ మహానాడు (Tdp Mini Mahandau)లో ...
చిత్తూరు (Chittoor): మదనపల్లె (Madanapalle)లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పర్యటిస్తున్నారు. టీడీపీ మినీ మహానాడు (Tdp Mini Mahanadu)లో ఆయన పాల్గొన్నారు. అయితే సభ జరుగుతుండగా కాసేపు వర్షం పడింది. ఆ తర్వాత ఆగిపోయింది. ఇక సభలో చంద్రబాబు మాట్లాడుతూ మినీ మహానాడు కోసం వరుణ దేవుడు కరుణించాడన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత టీడీపీ నాయకులు తీసుకోవాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న ద్రోహులకు బుద్ధి చెప్పాలి. రాష్ట్రంలో లేని సమస్యలన్నీ సృష్టిస్తున్నారని.. ప్రజలను బెదిరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మినీ మహానాడుకు రానివ్వకుండా పుంగనూరులో వైసీపీ నాయకులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ దొంగల్లారా జాగ్రత్త అని.... తాను కన్నెర్ల చేస్తే ఇంట్లో నుంచి బయటకు రాలేరని చంద్రబాబు హెచ్చరించారు. అవినీతి దోపిడీని అడ్డుకుంటే తమపై దాడులు చేస్తారా..? అని.. అక్రమార్క కేసులు పెడతారా? అని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
Updated Date - 2022-07-07T01:22:32+05:30 IST