మదనపల్లెలో టీడీపీ మినీ మహానాడు
ABN, First Publish Date - 2022-07-07T00:38:35+05:30
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మదనపల్లెలో పర్యటిస్తున్నారు. మదనపల్లె గ్రౌండ్లో...
చిత్తూరు: ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మదనపల్లెలో పర్యటించారు. మదనపల్లె గ్రౌండ్లో టీడీపీ మహానాడు కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం మదనపల్లెలో వర్షం కురుస్తోంది. అయినా సరే సభకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. జై టీడీపీ నినాదాలతో సభ ప్రాంగణం దద్దలిల్లిపోతోంది. ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2022-07-07T00:38:35+05:30 IST