ICMRకి రాసిన చంద్రబాబు లేఖలో పేర్కొన్న విషయాలు ఇవే
ABN, First Publish Date - 2022-10-07T02:11:51+05:30
ICMRకి రాసిన చంద్రబాబు లేఖలో పేర్కొన్న విషయాలు ఇవే
అమరావతి: ICMRకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలంలో కిడ్నీ సమస్యలపై లేఖ రాశారు. కిడ్నీ సమస్యలపై ICMR రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. ఏ కొండూరులో పెద్ద సంఖ్యలో ప్రజలు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారని తెలిపారు. గిరిజన, దళిత వర్గాల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ICMR బృందాన్ని పంపి క్షేత్రస్థాయిలో పరిశోధన చేయాలని సూచించారు. అలాగే సమస్య తీవ్రతపై సమగ్ర పరిశోధనలు చేయాలని సూచించారు. ప్రజల కిడ్నీ వ్యాధి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు.
Updated Date - 2022-10-07T02:11:51+05:30 IST