Chandrababu పర్యటనతో వైసీపీ నేతల గుండెల్లో గుబులు..!
ABN, First Publish Date - 2022-01-13T17:37:12+05:30
వైసీపీ మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ ఎదురుదాడికి దిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహంతో పార్టీ జిల్లా నాయకత్వంలో ఎట్టకేలకు కదిలక వచ్చింది. కుప్పం పర్యటనలో మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు
అమరావతి: వైసీపీ మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ ఎదురుదాడికి దిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహంతో పార్టీ జిల్లా నాయకత్వంలో ఎట్టకేలకు కదిలక వచ్చింది. కుప్పం పర్యటనలో మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు తీవ్రస్థాయిలో గొంతు విప్పడం రాజకీయ ప్రకంపనలు రేపింది. 2009లో నియోజకవర్గ పునర్విభజన కారణంగా పీలేరు నుంచి పుంగనూరు నియోజకవర్గానికి వచ్చిన పెద్దిరెడ్డిన బలంగా ఎవరు ఎదుర్కోలేకపోయారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడం.. పెద్దిరెడ్డి మంత్రి కావడంతో జిల్లాలో ఆయన ఆధిపత్యానికి ఎదురు లేకుండా పోయింది. పుంగనూరులో పరిస్థితి ప్రత్యకంగా చెప్పకర్లేదు. ఇక్కడ ఏకపక్షంగా రాజకీయాలు సాగిపోతు వచ్చాయి. తిరుపతి లోక్ సభ, బద్వేల్ ఉప ఎన్నికలు, కుప్పం మున్సిపల్ ఎన్నికలు ఇలా ప్రతి సందర్భాల్లోనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించి టీడీపీని బలంగా దెబ్బ తీసే ప్రయత్నం చేశారు.
Updated Date - 2022-01-13T17:37:12+05:30 IST