ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహానాడు నిర్వహణపై కమిటీలతో Chandrababu సమీక్ష

ABN, First Publish Date - 2022-05-16T21:10:17+05:30

మహానాడు నిర్వహణపై కమిటీలతో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సమీక్ష నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మహానాడు నిర్వహణపై కమిటీలతో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సమీక్ష నిర్వహించారు. ఒంగోలు మండవారిపాలెంలో ఈనెల 27, 28న మహానాడు జరుగనుంది భావజాలం చాటేలా మహానాడు (mahanadu) నిర్వహించాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. మొదటి రోజు ప్రతినిధుల సభ, రెండోరోజు బహిరంగ సభ ఉంటుంది. మహానాడు నిర్వహణకు ఒంగోలు మినీ స్టేడియంను టీడీపీ కోరింది. స్టేడియం ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం నిరాకరించింది. వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.


మహానాడులో భాగంగా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కార్యక్రమం ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షుల నియామకం నిర్ణయాన్ని జాతీయ అధ్యక్షుడు ఖరారు చేయనున్నారు. ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహణ ఆనవాయితీగా వస్తోంది. ఒక ఏడాది ఎన్నికల కారణం, రెండు ఏళ్ళు కోవిడ్ కారణంగా మాహానాడు ఆన్‌లైన్ కే పరిమితమైంది.

Updated Date - 2022-05-16T21:10:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising