Andhra news: శ్రీలంక దుర్భర పరిస్థితులు ఏపీలో ఇప్పటికే ఉన్నాయి: చంద్రబాబు
ABN, First Publish Date - 2022-07-21T01:32:32+05:30
శ్రీలంక (Sri Lanka) దుర్భర పరిస్థితులు ఏపీలో ఇప్పటికే ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆందోళన వ్యక్తం చేశారు.
అమరావతి: శ్రీలంక (Sri Lanka) దుర్భర పరిస్థితులు ఏపీలో ఇప్పటికే ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదన్నారు. ఉద్యోగులకు జీపీఎఫ్ (GPF) కూడా విత్డ్రా చేసుకునే పరిస్థితి లేదని తెలిపారు. పదవీ విరమణ ప్రయోజననాలు కూడా ఇవ్వలేకపోతున్నారని తెలిపారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పరిస్థితి లేదన్నారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు కొత్త అప్పులు చేస్తున్నారని విమర్శించారు. మూలధన వ్యయం ఎక్కడా లేదన్నారు. రహదారులకు మరమ్మతులు కూడా లేవని తెలిపారు. ఇవన్నీ శ్రీలంక లాంటి పరిస్థితులు కాదా? అని ప్రశ్నించారు. పోలవరం (Polavaram) నిర్లక్ష్యం ఎవరిదో కేంద్రమే నిర్ధారించిందని గుర్తుచేశారు. పోలవరంలో వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకే తమపై ఎదురుదాడి చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
Updated Date - 2022-07-21T01:32:32+05:30 IST