చంద్రబాబు.. నోటికి ప్లాస్టర్ వేసుకోవాలి: మంత్రి బొత్స
ABN, First Publish Date - 2022-04-05T00:48:45+05:30
నూతన జిల్లాల ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ
విజయనగరం: నూతన జిల్లాల ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు తన నోటికి ప్లాస్టర్ వేసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. సంక్షేమ పథకాలను సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలా తయారవుతుందని చంద్రబాబు తప్పుగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. పెద్దలను పెంచడానికి జిల్లాల విభజనను తమ ప్రభుత్వం చేయలేదన్నారు. మంచి సలహాలు ఇవ్వలేకపోతే చంద్రబాబుడు నోటికి ప్లాస్టర్ వేసుకోవాలన్నారు.
Updated Date - 2022-04-05T00:48:45+05:30 IST