ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీజీపీకి చంద్రబాబు లేఖ

ABN, First Publish Date - 2022-06-04T23:22:36+05:30

డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి (DGP Rajendranath Reddy)కి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి (DGP Rajendranath Reddy)కి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు. టీడీపీ నేత జల్లయ్య హత్య, పోలీసుల తీరుపై డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. హంతకులకు మరణశిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబీకుల అనుమతి లేకుండానే జల్లయ్య మృతదేహాన్ని.. పోలీసులు బలవంతంగా రావులాపురం తరలించారని మండిపడ్డారు. కుటుంబీకులను సైతం బలవంతంగా బస్సుల్లో తీసుకెళ్లారని, జల్లయ్య అంత్యక్రియలకు వెళ్లకుండా టీడీపీ నేతలను అడ్డుకున్నారని చంద్రబాబు తెలిపారు. జల్లయ్య అంత్యక్రియలకు వెళ్లేందుకు టీడీపీ నేతలను, జల్లయ్య బంధువులను అనుమతించాలని లేఖలో కోరారు. పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించి ఉంటే హత్య జరిగేది కాదన్నారు. ఇప్పటివరకు మాచర్లలోనే ఐదుగురు బీసీ సమాజిక వర్గానికి చెందిన నేతలను హత్య చేశారని తెలిపారు. మాచర్లలో బీసీవర్గంపై జరుగుతోన్న హత్యాకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేయాలని చంద్రబాబు లేఖ (letter)లో డిమాండ్ చేశారు.

Updated Date - 2022-06-04T23:22:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising