టీడీపీ నేతలపై వైసీపీ గూండాల దాడి దుర్మార్గం: చంద్రబాబు
ABN, First Publish Date - 2022-04-30T21:57:07+05:30
శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలపై వైసీపీ దాడిని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఖండించారు.
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలపై వైసీపీ దాడిని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఖండించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్కు వెళ్తున్నటీడీపీ నేతలపై వైసీపీ గూండాల దాడి దుర్మార్గమన్నారు. టీడీపీ నేత చలపతి నాయుడుపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ఎన్నికలంటే వైసీపీ ఎందుకు భయపడుతోంది? అని ప్రశ్నించారు. నామినేషన్ పత్రాలు లాక్కెళ్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. దాడులు చేస్తున్న వైసీపీ నేతలను కట్టడి చేయలేని పోలీసులు... నామినేషన్కు వెళ్తున్న టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని చంద్రబాబు అన్నారు.
Updated Date - 2022-04-30T21:57:07+05:30 IST