ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎవరి అండ చూసుకుని పోలీసులు ఇలా రెచ్చిపోతున్నారు?: Chandrababu

ABN, First Publish Date - 2022-06-24T17:39:45+05:30

వైసీపీ కార్యకర్తల్లా(YCP Cadre) మారి గాడి తప్పిన పోలీసు అధికారులను వదిలేది లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi : వైసీపీ కార్యకర్తల్లా(YCP Cadre) మారి గాడి తప్పిన పోలీసు అధికారులను వదిలేది లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ట్విటర్ వేదికగా హెచ్చరించారు. సీఎం జగన్ రెడ్డి(CM Jagan Reddy) దయాదాక్షిణ్యాల కోసం కొందరు పోలీసులు ఇంతలా దిగజారి పోయారంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. చిత్తూరులో మేయర్ దంపతుల హత్య కేసులో సాక్షులను వేధించి, అక్రమ కేసులు పెట్టడంలో అర్థం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. నేరస్తులను కాపాడుతున్నారా? అని నిలదీశారు. పోలీసులే పూర్ణ ఇంట్లో గంజాయి బస్తా పెట్టి కేసులు రాయడం దుర్మార్గమన్నారు. పోలీసులు చేస్తున్న దౌర్జన్యాన్ని అడ్డుకోడానికి వచ్చిన చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలత మీదికి, మహిళ అని కూడా చూడకుండా పోలీసు జీపు ఎక్కించడానికి ఎంత ధైర్యమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి అండ చూసుకుని ఇలా రాక్షసంగా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేయించిన ఈ దౌర్జన్యకాండను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. వైసీపీ కార్యకర్తల్లా మారి తప్పులు చేస్తున్న పోలీసులను వదిలే ప్రసక్తే లేదన్నారు. పార్టీ తరపున న్యాయపోరాటం చేస్తామని.. రేపు తాము అధికారంలోకి వచ్చాక గాడి తప్పిన ప్రతి అధికారిపై చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు.


Updated Date - 2022-06-24T17:39:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising