భోజనం అదుర్స్.. చంద్రబాబుపై తమిళనాడు టీచర్ల ప్రశంసలు
ABN, First Publish Date - 2022-07-05T23:17:17+05:30
అన్నక్యాంటిన్లో తమిళనాడు టీచర్లు కడుపునింపుకున్నారు. టీడీపీ నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో ఆకలి తీర్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై..
చిత్తూరు(Chittoor) : అన్నక్యాంటిన్ (Anna Canteen)లో తమిళనాడు టీచర్లు (Tamil nadu Teachers) కడుపునింపుకున్నారు. టీడీపీ(Tdp) నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో ఆకలి తీర్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Tdp Chief Chandrababu)పై ప్రశంసలు కురిపించారు. అన్న క్యాంటీన్లో భోజనం చాలా బాగుందని తెలియజేశారు. అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తే బాగుంటుందన్నారు.
కాగా ప్రభుత్వం పేదల కడుపు కొడుతుంటే అన్న క్యాంటీన్లు కడుపు నింపుతున్నాయి. అన్న క్యాంటీన్లలో ప్రతి రోజూ వందల మంది ఆకలి తీర్చుకుంటున్నారు. పేదల కడుపు నింపడానికి దాతలు కూడా ముందుకు వస్తున్నారు. పేదలకు కనీసం రెండు పూటలన్నా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం అన్న క్యాంటీన్. పేదల ఆకలి తీర్చుతున్న అన్న క్యాంటీన్లపై వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టింది. ప్రజల ఆకలి తీర్చుతున్న అన్న క్యాంటీన్లు ఎత్తివేయడంతో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అన్న క్యాంటీన్లు ఎత్తివేసిందని ప్రజలు మండిపడుతున్నారు.
Updated Date - 2022-07-05T23:17:17+05:30 IST