చలో విజయవాడ కార్యక్రమం సక్సెస్: సీపీఐ రామకృష్ణ
ABN, First Publish Date - 2022-02-03T23:54:31+05:30
ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం సక్సెస్ అయిందని సీపీఐ రాష్ట్ర
కర్నూలు: ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం సక్సెస్ అయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. నగరంలో ఆయన మాట్లాడారు. ఈ సభ జగన్ నియంతృత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. ఉద్యోగులు కొత్తవి ఏమీ కోరడం లేదన్నారు. పీఆర్సీ నివేదికను ఉద్యోగులకు జగన్ ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. జగన్ ఏమన్నా పైనుంచి ఊడి పడ్డారా అని ఆయన ప్రశ్నించారు. జగన్ ఉండగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావన్నారు. జగన్ సమస్య పరిష్కారం చేయమంటే కొత్త సమస్యలు పుట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
జిల్లాల విభజన సమాచారాన్ని మంత్రులకు ఆన్లైన్లో పంపి సీఎం ఆమోదం తెలిపారన్నారు. రానున్న రోజుల్లో జగన్ ఆన్లైన్లోనే భోజనం చేస్తాడేమోనని ఆయన ఎద్దేవా చేశారు. ఉద్యోగుల సమస్యలపై జగన్ నేరుగా జోక్యం చేసుకోవాలని ఆయ డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యోగులు జగన్ను ఇడుపులపాయ ఇంటికి పంపిస్తారని ఆయన హెచ్చరించారు. ఉద్యోగులు శాంతియుతంగా ర్యాలీ చేస్తే అరెస్టులు చేయడం ఏంటని ఆయన మండిపడ్డారు.
Updated Date - 2022-02-03T23:54:31+05:30 IST